pc: pinterest
ప్రపంచం ఎలా నడుస్తోందో మనం తెలుసుకోవాలంటే ధ్యానంచేయాల్సిందే అంటాడు గౌతమ బుద్ధుడు. ఇది నిజం కూడా.. ధాన్యం తెలివినిస్తుంది. ధ్యానం చేయకపోతే, అంతాతెలియనిస్ధితి ఏర్పడి మనిషి అభివృద్ధి అసాధ్యమన్నది కొందరి భావన. మన సమాజంలో ప్రస్తుతం మన ఒత్తిడి తగ్గించడానికి అనేక ధ్యానపద్ధతులు నేర్పిస్తున్నారు మెడిటేషన్ ఎక్స్ పర్ట్స్. ఇవి ఎలా చేయాలి... వాటి ఉపయోగాలేంటంటే... మెడిటేషన్ (ధ్యానం) చేసేటప్పుడు మీవీపును నిటారుగా సౌకర్య వంతంగా పెట్టి కూర్చొని, కళ్ళు మూస్కొని, తేలికగా శ్వాసను పీల్చండి. ఈ ధ్యాన పద్ధతిలో శ్వాస మీ ప్రవేశించటం, బయటకు వదలటం ప్రక్రియను శ్రద్దగా గమనించాలి. దీనినే శ్వాస మీద ధ్యాస అని పిలుస్తాం. రోజూ ధ్యానాన్ని 15 నుండి 20 నిమిషాల పాటు చేస్తే మనిషిలో ఒత్తిడి గణనీయంగా తగ్గిపోతుంది. ఇక మానసిక ధాన్యంతో మనసును ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంచుకోవచ్చు. నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చొని, ప్రశాంతతని ఆశ్వాదిస్తూ...ఈ ధ్యానం రోజూ 10 నిమిషాల చొప్పున రెండుసార్లు చేస్తే చాలు. మనసు, శరీరం రెండు అనుసంధానించబడి ఊహించ లేని శక్తి కల్గి మనలో తీవ్ర నమ్మకాన్ని పెంచుతుంది. . ధ్యానించేటపుడు ఎంత ప్రధానమైన పని అయినా సరే వదిలేసి పాజిటివ్ ఆలోచనలోకి వెళ్లాలి. ఊహా ధ్యానం మరో పద్దతి. రోజులో 20-30 నిమిషాల సమయం పూర్తి విశ్రాంతిలో ఉంటూ, ఆహ్లాదాన్నిచ్చే చిత్రాలు, బొమ్మలు, పెయింటింగ్లు చూస్తూ వుండండి.అవి మీ మనస్సుల్లో నెలకొన్న ఆందోళనల్ని తగ్గించి...పూర్తిస్థాయి విశ్రాంతిని కలిగిస్తాయి.
Comments
Post a Comment